- ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక
బషీర్ బాగ్, వెలుగు: ఛత్తీస్గఢ్దండకారణ్యంలో కొనసాగుతున్న ఆపరేషన్ కంగార్ ను వెంటనే ఆపాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వేదిక ప్రతినిధి ప్రొఫెసర్హరగోపాల్ మాట్లాడుతూ.. మధ్య భారతదేశంలో 10 నెలలుగా కొనసాగుతున్న ఆదివాసీ హత్యాకాండ మరింత తీవ్రమైందన్నారు.
ఛత్తీస్గఢ్, అబూజ్ మాడ్, తెల్తులి, నెండూరు అటవీ ప్రాంతాల్లో ఈ నెల 4న భద్రతా దళాలు అమాయక ఆదివాసీలను చంపేశాయని, తర్వాత ఎన్కౌంటర్గా ప్రకటించాయని మండిపడ్డారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను చంపారని ఆరోపించారు. అటవీ ప్రాంతంలోని సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికే కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిందని మండిపడ్డారు.
4న జరిగిన ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరపాలని డిమాండ్చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని కోరుతూ నవంబర్ 3న ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
