Adivi Sesh G2: ధోని బొమ్మతో దిమ్మతిరిగిపోయే హింట్.. ఆడియన్స్.. G2 లోడింగ్!

Adivi Sesh G2: ధోని బొమ్మతో దిమ్మతిరిగిపోయే హింట్.. ఆడియన్స్.. G2 లోడింగ్!

టాలీవుడ్ నటుడు అడివి శేష్(Adivi Sesh) గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన సినిమాలతో ఆడియన్స్ కు అద్భుతమైన అనుభూతిని అందించడం మనోడి స్టయిల్. అలా వచ్చినవే.. క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ సినిమాలు. ఈ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్స్ అవడంతో ఆడియన్స్ లో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఎంతలా అంటే.. అడివి శేష్ నుండి ఒక సినిమా వస్తుంది అంటే ఆ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది అనేంతలా. ఆ రేంజ్ లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు ఈ హీరో.

అయితే.. అంతలా ఆడియన్స్ ను తన వైపుకు తిప్పుకున్న శేష్.. చాలా కాలంగా ఆడియన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఆయన హీరోగా వచ్చిన ప్రీవియస్ మూవీ మేజర్ విడుదలై చాలా కకాలమే అయ్యింది. అప్పటినుండి ఇప్పటికి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు శేష్. కనీసం ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమా గురించి అప్డేట్ కూడా ఇవ్వలేదు. అందుకే ఆయన ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ లో ఉన్నారు. 

మరి.. వాళ్ళ బాధను అర్థం చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ, తన నెక్స్ట్ సినిమా G2 సినిమా గురించి చిన్న హింట్ ఇచ్చాడు శేష్.అది కూడా ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని ఫోటోను షేర్ చేస్తూ. అవును.. ధోని ఈ మధ్య చాలా కాలం తరువాత వైజాగ్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోసం గ్రౌండ్ లోకి దిగి తన బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ..     బఫరింగ్ అనేది బాధ కలిగించొచ్చు కానీ, ఒకసారి లోడ్ అయ్యాక ఆ అరాచకం మాములుగా ఉండదు.. G2 లోడింగ్.. అంటూ రాసుకొచ్చాడు. అలాగే G2 మూవీ రావడం కాస్త లేట్ అవ్వోచ్చేమో కానీ, వచ్చాక నెక్స్ట్ లెవల్ ఫీలింగ్ ఉంటుందని చెప్పకనే చెప్పాడు. దీంతో అడివి శేష్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.