
జనగామ అర్బన్, వెలుగు: 2025–-26 విద్యాసంవత్సరానికి గానూ బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో 8వ తరగతిలో 35 సీట్లు ఉన్నాయని ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గిరిజన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 9 నుంచి 13 వరకు హనుమకొండలోని గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 20న లాటరీ పద్ధతిలో ఎంపిక ఉంటుందని తెలిపారు.