రేవంత్​, భట్టితో అహ్లూవాలియా బృందం భేటీ

రేవంత్​, భట్టితో అహ్లూవాలియా బృందం భేటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెడుతుండటంతో  శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఆర్థిక, విద్యుత్తు, ప్రణాళిక రంగాలపై చర్చించారు.

రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం పడకుండానే ఆరు గ్యారంటీలను ముందుకు తీసుకెళ్లే  అంశంపై చర్చ జరిపారు. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యం పెంచడంపై మాట్లాడుకున్నారు. ప్లానింగ్ బోర్డు సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన సూచనలను సింగ్ బృందం చేసింది.