దేశంలో తొలిసారి: రోడ్డు పై ఉమ్మేసాడని ఫైన్ వేశారు

దేశంలో తొలిసారి: రోడ్డు పై ఉమ్మేసాడని ఫైన్ వేశారు

అహ్మదాబాద్‌ : పబ్లిక్‌ ప్లేస్‌ లో ఉమ్మేసిన ఓ వ్యక్తికి గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఫైనేసింది. ఉమ్మేసిన వారికి ఇలా ఫైన్‌ వేయడం దేశంలోని తొలిసారి. నరోడాకు చెందిన మహేశ్‌ కుమార్‌ ఏప్రిల్‌ 5న సర్దార్‌పటేల్‌ రోడ్డులో ఉమ్మేశాడు. దగ్గర్లో ఉన్న సీసీ టీవీలో ఇది రికార్డయింది. పబ్లిక్‌ హెల్త్‌‌ చట్టాలను ఉల్లంఘించినందుకు అదే రోజు కార్పొరేషన్‌ అధికారులు ఆయనకు ఈ మెమో జారీచేశారు. రూ.100 జరిమానా విధించారు.