మోడీ స్టేడియంలో గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

మోడీ స్టేడియంలో గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

ఇండియా,న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వేదిక కానుంది.  మూడు మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా​ ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.  ఈ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌ల్లో తలపడింది. ఇందులో  నాలుగు మ్యాచుల్లో టీమిండియా గెలవగా మరో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు మూడు సార్లు గెలుపొందాయి. ఇక్కడ అత్యధిక స్కోర్ ( ఇంగ్లండ్ పై భారత్ ) 224 కాగా అత్యల్ప స్కోర్ 124 (భారత్  పై ఇంగ్లండ్ )గా ఉంది. 

జట్ల (అంచనా) 

ఇండియా: హార్దిక్​ (కెప్టెన్​), గిల్​, ఇషాన్​, రాహుల్​ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్​ హుడా, వాషింగ్టన్​ సుందర్​, శివమ్​ మావి, కుల్దీప్​ యాదవ్​, ఉమ్రాన్​ మాలిక్​, అర్ష్​దీప్​ సింగ్​. 
న్యూజిలాండ్​: శాంట్నర్​ (కెప్టెన్​), ఫిన్​ అలెన్​, కాన్వే, చాప్​మన్​, గ్లెన్​ ఫిలిప్స్​, డారిల్​ మిచెల్​, మైకేల్​ బ్రేస్​వెల్​,సోధీ, ఫెర్గుసన్​, డఫీ, ​ టిక్నర్​.