
ఇండియా,న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వేదిక కానుంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఈ స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ల్లో తలపడింది. ఇందులో నాలుగు మ్యాచుల్లో టీమిండియా గెలవగా మరో రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 3 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు మూడు సార్లు గెలుపొందాయి. ఇక్కడ అత్యధిక స్కోర్ ( ఇంగ్లండ్ పై భారత్ ) 224 కాగా అత్యల్ప స్కోర్ 124 (భారత్ పై ఇంగ్లండ్ )గా ఉంది.
జట్ల (అంచనా)
ఇండియా: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్.
న్యూజిలాండ్: శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, కాన్వే, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైకేల్ బ్రేస్వెల్,సోధీ, ఫెర్గుసన్, డఫీ, టిక్నర్.