- పాస్ పర్సంటేజీని పెంచడమే లక్ష్యంగా కొత్తగూడెం కలెక్టర్ వినూత్న ఆలోచన
- జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు 124
- టెన్త్ విద్యార్థులు 4,418 మంది
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పదోతరగతిలో విద్యార్థుల పాస్పర్సంటేజీని పెంచడమే లక్ష్యంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి.పాటిల్వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చదువులో వెనకబడిన స్టూడెంట్స్ ను గుర్తించి, గత మూడేండ్ల ప్రశ్నాపత్రాలను ఏఐ ద్వారా విశ్లేషించి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ప్రీ ఫైనల్ మార్కుల ఆధారంగా..
ఈ ఏడాది జిల్లాలోని 124 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 4,418 మంది విద్యార్థులు పదోతరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారు. టెన్త్ రిజల్ట్స్లో జిల్లా గత నాలుగైదేండ్లుగా రాష్ట్రంలో చివరి 5 స్థానాలకే పరిమితమవుతోంది. ఈ క్రమంలో ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడమే లక్ష్యంగా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతోపాటు హెచ్ఎంలతో ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా చదువులో వెనకబడిన విద్యార్థులను గుర్తించాలని ఆదేశించారు. గత మూడేండ్లలో రిపీట్గా ప్రశ్నలు వచ్చిన చాప్టర్స్తోపాటు ఏయే చాప్టర్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఏఐ ద్వారా విశ్లేషించాలని చెప్పారు. ఈ ప్రోగ్రాం బాధ్యతను కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ కు అప్పగించి, ఆయనకు సహాయకుడిగా అల్లూరిని నియమించారు.
గత సెప్టెంబర్ నుంచి స్పెషల్ క్లాసులు
ఈసారి టెన్త్ఫలితాల్లో జిల్లాకు మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు గత సెప్టెంబర్ నుంచే స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏఐతో విశ్లేషణ వివరాలను సోమవారం కలెక్టర్కు నివేదించిన అనంతరం ఆయా సబ్జెక్టుల టీచర్లుచదువులో వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకోనున్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా వారిని ఎగ్జామ్స్కు ప్రిపేర్చేయించేందుకు ప్లాన్చేస్తున్నారు. మరోవైపు స్టూడెంట్స్గైర్హాజరును తగ్గించేందుకు గ్రామ, మండల మహిళా సమాఖ్యల సాయం తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. దీంతో టీచర్లు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తూ టెన్త్స్టూడెంట్స్రెగ్యులర్గా పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
కలెక్టర్ సూచనల మేరకే..
ఈ విద్యాసంవత్సరం టెన్త్లో అత్యధిక పాస్పర్సంటేజీ సాధించడంపై కలెక్టర్ప్రత్యేకంగా దృష్టి సారించారని ఇన్చార్జి డీఈవో నాగలక్ష్మి తెలిపారు. చదువులో వెనకబడిన విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించేలా ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకోవాలని సూచించారన్నారు. పిల్లల తల్లిదండ్రులతో టీచర్లు తరచూ ఇంటరాక్ట్అవుతూ మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.
