సాగు మరింత ఈజీ... ఈ రోబో మొక్కలు నాటుతది.!

సాగు మరింత ఈజీ... ఈ రోబో  మొక్కలు నాటుతది.!

ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో ప్రత్యేకమైన ముద్ర వేస్తోంది. ఇప్పుడు రైతులకు సాయం చేసేందుకు వ్యవసాయ రంగంలోకి దిగింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సాగు పద్ధతులు సులభమయ్యాయి. ఇప్పుడు ఏఐ రాకతో మరింత ఈజీ కానున్నాయి. 

అడవుల్లో, పొలాల్లో మొక్కలు నాటేందుకు ‘ప్లాంటియో–100’ పేరుతో ఒక ఏఐ బేస్డ్‌‌‌‌ రోబోని తయారుచేశారు. బ్రెజిల్‌‌‌‌లో తయారైన ఈ రోబో గంటకు వంద కంటే ఎక్కువ మొక్కలను నాటగలదు. దీన్ని ముఖ్యంగా అమెజాన్ లాంటి క్షీణిస్తున్న అడవుల్లో మొక్కలు నాటేందుకు తయారుచేశారు. ఇది ఎలాంటి సందుల్లోకైనా వెళ్లి మొక్కలు నాటుతుంది. దీన్ని వ్యవసాయ క్షేత్రాల్లో కూడా వాడుకోవచ్చు. ఇది సాధారణ అగ్రిటెక్‌‌‌‌ మెషీన్లలా కాకుండా చాలా శ్రద్ధగా పనిచేస్తుంది. దానిలో కొన్ని మొక్కలను లోడ్‌‌‌‌ చేసి అడవిలోకి పంపిస్తే..  నేలలోని తేమ, అక్కడ పడుతున్న సూర్యకాంతి, భూమిలోని సారం.. లాంటివన్నీ అంచనా వేస్తుంది. 

►ALSO READ | ఘోస్ట్‌‌‌‌ నెట్‌‌‌‌లను గుర్తించే ఏఐ

ఆ రియల్‌‌‌‌టైం డేటాను విశ్లేషించి, అక్కడ ఏ జాతి మొక్క నాటితే బాగా పెరుగుతుందో నిర్ణయిస్తుంది. ఆ తర్వాత నేలను తవ్వి అక్కడ పెరిగే అత్యంత అనుకూలమైన మొక్కను నాటుతుంది. దీన్ని వాడి అడవుల్లో మొక్కలు నాటితే.. పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించవచ్చు అంటున్నారు ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌. దీని పని మొక్క నాటడం వరకే కాదు.. ఆ తర్వాత దాని ఆరోగ్యాన్ని కూడా పరీక్షిస్తుంది. ఇది మొక్కల మనుగడ రేటును 87 శాతం వరకు నిర్ధారించగలదు.