దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు

దినకరన్ పార్టీతో ఎంఐఎం పొత్తు

తమిళనాడులో ఎన్నికల వేళ మరో పొత్తు పొడిచింది. దినకరన్ పార్టీ AMMKతో  పొత్తుపెట్టుకుంటున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. తమిళనాడులో మూడు స్థానాల్లో  AMMKతో కలిసి పోటీచేస్తున్నట్లు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. తమిళనాడులో దినకరన్ పార్టీ అంటే ప్రజల్లో నమ్మకముందన్నారు. Dmk తో విభేదం ఉందా లేదా అనేది 12న జరిగే సభలో చెబుతామన్నారు. తమిళనాడులో 25 అసెంబ్లీ స్థానాల్లో ఎంఐఎంకి  మంచి స్పందన ఉందని.. దినకరన్ తో చర్చల అనంతరం మూడు స్థానాల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యామన్నారు. వనియంబాడి, కృష్ణగిరి, శంకరపురం స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు.