విమాన ప్రమాదం.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు

విమాన ప్రమాదం.. వెయ్యి డిగ్రీల ఉష్ణోగ్రతతో మంటలు

అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో  242 మంది చనిపోయిన సంగతి తెలసిందే. ఈ ప్రమాదంలో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. డాక్టర్లు డీఎన్ ఏ టెస్టులు చేస్తున్నారు. 

 టేకాఫ్ అయిన కాసేపటికే  కుప్పకూలిన ఈ విమానంలో  1.25 లక్షల లీటర్ల ఫ్యుయేల్ ఆయిల్ లోపల  ఉందని అధికారులు తెలిపారు. దీని వల్ల ప్రమాద సమయంలో  విమానం లోపల, చుట్టు పక్కల  దాదాపు 1000 డిగ్రీల సెల్సియస్ తో మంటలు చెలరేగాయని  అధికారులు తెలిపారు. అధిక టెంపరేచర్ వల్ల సహాయక చర్యలకు కష్టమైందని... ఆ ప్రదేశంలో   వచ్చే వేడి వల్ల  పక్షులు ,కుక్కులు కూడా తప్పించుకోలేకపోయినట్లు చెప్పారు.

జూన్ 12న  మధ్యాహ్నం 242 మంది ప్రయాణికులు,సిబ్బందితో లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లోని ఓ మెడికల్ కాలేజ్ పై కుప్పకూలిన సంగతి తెలిసిందే.వి మానంలో ప్రయాణిస్తున్న 241 మందితో పాటు  మెడికల్ కాలేజ్ లోని  పలువురు డాక్టర్లు, సిబ్బంది 24 మంది వరకు చనిపోయారు.  

విమానం క్రాష్ ఘటనతో దేశం ఉలిక్కి పడింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద ఘటన అయిన ఈ ప్లాన్ క్రాష్ పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తం చేశారు.  జూన్ 13 నాటికి మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ రమేష్ ప్రాణాలతో బయట పడటం గమనార్హం.   ప్రధాని మోడీ ఘటనాస్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్కడు విశ్వాస్ రమేష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు మోడీ.  ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇతర క్షతగాత్రులను కూడా పరామర్శించారు.

►ALSO READ | ఎయిర్ ఇండియా విమానం క్రాష్.. బ్రతికిన ఒకే ఒక్కడికి పరిహారంగా ఏం చెల్లిస్తారు..? 

మరో వైపు విమాన ప్రమాదంపై  భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేస్తోంది . ఏఏఐబీ డైరెక్టర్ జనరల్, ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌‌‌‌తో సహా ఒక బృందం దర్యాప్తు చేస్తోంది. ఎయిర్ ఇండియా విమానం శిథిలాల నుంచి గుజరాత్ ATS ఒక డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది.