ఇజ్రాయిల్‌‌‌‌కు ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా సర్వీస్‌‌‌‌లు నిలిపివేత

ఇజ్రాయిల్‌‌‌‌కు ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా సర్వీస్‌‌‌‌లు నిలిపివేత

న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌–ఇజ్రాయిల్‌‌‌‌ మధ్య ఘర్షణ వాతావరణం ముదరడంతో ఇజ్రాయిల్‌‌‌‌లోని  టెల్‌‌‌‌ అవివ్‌‌‌‌కు ఫ్లయిట్ సర్వీస్‌‌‌‌లను ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా తాత్కాలికంగా నిలిపివేసింది.  ఢిల్లీ– టెల్‌‌‌‌ అవివ్ మధ్య డైరెక్ట్ ఫ్లయిట్స్‌‌‌‌ను టెంపరరీగా సస్పెండ్ చేస్తున్నామని కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు. 

ఈ రూట్‌‌‌‌లో వారానికి నాలుగు విమాన సర్వీస్‌‌‌‌లను ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా నడుపుతోంది. హామాస్‌‌‌‌ అటాక్‌‌‌‌తో కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 7 న  కూడా ఢిల్లీ– టెల్‌‌‌‌ అవివ్‌‌‌‌ మధ్య సర్వీస్‌‌‌‌లను నిలిపివేసింది.