డబ్బులు రిఫండ్ చేసేది లేదు : విమానయాన సంస్థలు

డబ్బులు రిఫండ్ చేసేది లేదు : విమానయాన సంస్థలు

లాక్ డౌన్ పొడగింపుతో విమానయాన సంస్థలు  కీలక నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడిగించడంతో విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. అయితే ముందుగా ప్రయాణాల కోసం రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు వారి సొమ్మును రిఫండ్ ఇచ్చేది లేదని విమానయాన సంస్థలు స్పష్టం చేశాయి. విమానాలు రద్దైనా టికెట్ల సొమ్ము రిఫండ్ చేయబోమని చెప్పిన విమానయాన సంస్థలు అదనపు రుసుము లేకుండా వారు తమ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపాయి.