- ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్
హైదరాబాద్/ఇబ్రహీంపట్నం, వెలుగు: వేల మంది స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. స్టూడెంట్లను మోసం చేసిన గురునానక్విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలోని అంబేద్కర్విగ్రహం ముందు నేతలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంస్థల దోపిడీఎక్కువైందని, ఎలాంటి అనుమతులు లేకుండానే గురునానక్ యూనివర్సిటీ అడ్మిషన్లను స్వీకరించిందన్నారు. 3,800 మంది స్టూడెంట్లను జాయిన్చేసుకొని, రూ.180 కోట్ల ఫీజులను వసూలు చేసి, వారి జీవితాలతో చెలగాటం ఆడిన కాలేజీ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
గురునానక్, శ్రీనిధిలపై క్రిమినల్ కేసులు పెట్టాలె
గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి, కార్యదర్శి నాగరాజు బాధిత స్టూడెంట్లతో కలిసి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి వినతి పత్రం అందజేశారు.