
మాజీ మిస్ వరల్డ్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తన ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్లు ఎయిర్పోర్ట్ సిబ్బందితో పోజులిచ్చిన ఫోటో ఒకటి వైరల్గా మారింది. ఇటీవల వీరిద్దరూ న్యూయార్క్లో విహారయాత్రకు వెళ్లగా..టూర్ ముగించుకుని ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వగానే విమానాశ్రయ సిబ్బందితో సెల్ఫీ ఇచ్చారు.
ఈ తాజా ఫొటోలో తల్లి-కూతురి జంట నలుపు రంగు దుస్తుల్లో కవలలుగా కనిపించేలా పోజులివ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇందులో ఆరాధ్య సూపర్ క్యూట్ 'టామ్ అండ్ జెర్రీ' ప్రింట్ టీ-షర్ట్ ధరించి ఉంది.
ఈ ఫోటోలను అదానీ లాంజ్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్తో పంచుకుంది. “ఐశ్వర్య రాయ్ మరియు ఆమె బ్యూటీఫుల్ డాటర్ ఆరాధ్య బచ్చన్ ను కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ సెల్ఫీతో మా ఈరోజును చాలా బ్యూటీఫుల్ గా చేసినందుకు ధన్యవాదాలు! త్వరలో మిమ్మల్ని మళ్లీ చూడాలని ఎదురుచూస్తున్నాను! ” అంటూ షేర్ చేసింది.
అయితే, రీసెంట్ టైంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ విడిపోయారనే పుకార్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయి. దీనికితోడు, అనంత్ అంబానీ పెళ్లిలో కూడా ఐశ్వర్యరాయ్ ఒంటరిగా కనిపించడంతో ఈ రూమర్ కి బలాన్ని చేకూర్చింది.ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న ఫొటోల్లో అభిషేక్ బచ్చన్ కనిపించకపోవడంతో..నిజంగానే విడిపోయారా..లేక ఏదైనా సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడా? అనే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. కానీ, ఈ జంట విడాకుల రూమర్స్ పై ఇంకా స్పందించలేదు.