కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కాం : ప్రకాశ్​రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కాం : ప్రకాశ్​రెడ్డి

కాటారం,వెలుగు : బీఆర్​ఎస్​ ప్రభుత్వం గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్​ దేశంలోనే అతిపెద్ద స్కాం అని జయశంకర్​ భూపాలపల్లి కాంగ్రెస్​ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్​ ఐత ప్రకాశ్​రెడ్డి పేర్కొన్నారు.గురువారం కాటారం మండలకేంద్రంలోని కాంగ్రెస్​ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ నాణ్యత లోపంతో కుంగిపోవడం యావత్తు దేశానికి తెలుసని అలాంటి ప్రాజెక్టుతో మళ్లీ రాజకీయాలకు బీఆర్​ఎస్​ ప్రభుత్వం తెరలేపుతుందని ప్రకాశ్​రెడ్డి అన్నారు.

ఛలో మేడిగడ్డ పేరుతో బీఆర్​ఎస్​ పార్టీ మేడిగడ్డకు రావడం సిగ్గుచేటని అవినీతి చేసినందుకుగానూ తెలంగాణ ప్రజానీకానికి మేడిగడ్డ వద్ద క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు.లక్షల కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుని తమ కుటుంబం కోసమే కేసీఆర్​ నిర్మించుకున్నారని అలాంటి తప్పు చేయడమే కాకుండా మేడిగడ్డ పర్యటన పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గు చేటని అన్నారు.కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య,కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​ ప్రభాకర్​రెడ్డి,నాయకులు కొట్టె ప్రభాకర్​,దేవేందర్​యాదవ్​,అశోక్​,తదితరులు పాల్గొన్నారు.