- అంబులెన్సుల్లో డబ్బులు తరలిస్తున్నరు
- అజయ్ ఘోష్ ఆరోపణలు
హైదరాబాద్, వెలుగు : అంబులెన్సులను బీఆర్ఎస్ ప్రభుత్వం తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నదని, వాటిలో డబ్బులను తరలిస్తున్నదని సీడబ్ల్యూసీ మెంబర్, తెలంగాణ కమ్యూనికేషన్స్ ఇన్చార్జి అజయ్ కుమార్ ఘోష్ ఆరోపించారు. గాంధీభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అంబులెన్సుల్లో పేషెంట్లు లేరని, 400 కిలోమీటర్లు అంబులెన్సులు వట్టిగనే ట్రావెల్ చేశాయా అని ప్రశ్నించారు.
ములుగులో బయలుదేరిన అంబులెన్సులు రాయగిరి టోల్ ప్లాజాకు రాగానే మాయమైపోయాయని తెలిపారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అంబులెన్సుల్లో మద్యాన్ని సరఫరా చేస్తున్నారని చెప్పారు. ధరణి పోర్టల్ను కోట్ల సంపాదనకు వాడుకున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.