- సౌదీలో జరిగిన సమిట్లో దోవల్
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగడానికి మించిన ఆనందం ఇండియాకు మరొకటి లేదని జాతీయ భద్రతా సలహాదా రు అజిత్ దోవల్ అన్నారు. యుద్ధం మొదలైన నాటి నుంచి తాము శాంతి కోసం కృషి చేస్తున్నామని గుర్తుచేశారు.
ఉక్రెయిన్ అంశంపై ఆదివారం జెడ్డాలో జరిగిన 42 దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో దోవల్ మాట్లాడారు. ఉక్రెయిన్ వివాదం ప్రభావం గ్లోబల్ సౌత్పై పడుతోందని దోవల్ అన్నారు. దీంతో ఆయా దేశాలకు ఇండియా సాధ్యమైనంతమేర ఆర్థిక సాయం అందిస్తోందని గుర్తుచేశారు.