జమ్మూకాశ్మీర్ లో మీడియా సంస్థ ఆఫీసులో తూటాల దొరకడం కలకలం రేపుతోంది.. గురువారం ( నవంబర్ 20) జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ పత్రికా ఆఫీసులో కాశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహించగా ఏకే 47 తూటాలు లభ్యమయ్యాయి. క్యాడ్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, మూడు గ్రేనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పై కేసు నమోదు చేశారు.
దేశానికి వ్యతిరేకంగా, జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల వేర్పాటు వాద సమాచారాన్ని చేరవేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలతో సోదాలు నిర్వహించారు.
కశ్మీర్ టైమ్స్ ను వేగ్ భాసిన్ 1952లో స్థాపించారు. 1964 వరకు వీక్లీ గా వున్న ఈ పత్రిక ఆ తర్వాత డైలీగా మారింది.
