యూత్‌‌‌‌‌‌‌‌ను ఆలోచింపజేసేలా.. అలా నిన్ను చేరి

యూత్‌‌‌‌‌‌‌‌ను ఆలోచింపజేసేలా.. అలా నిన్ను చేరి

దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో  మారేష్ శివన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాలపాటి సుధాకర్ నిర్మించిన  సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దినేజ్ తేజ్ మాట్లాడుతూ ‘ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎదురయ్యే సంఘర్షణే ఇందులో ఉంటుంది. ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అన్నది చూపిస్తాం. ఆ పాయింట్ యూత్‌‌‌‌‌‌‌‌ను ఆలోచింపజేసేలా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. 

గణేష్ పాత్రలో కనిపిస్తా. హెబ్బా పటేల్ నాకంటే సీనియర్. సెట్‌‌‌‌‌‌‌‌లో ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పాయల్ రాధాకృష్ణకు ఫస్ట్ మూవీ అయినా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసింది. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ సినిమాకు మ్యూజిక్ ప్లస్ అవుతుంది. చంద్రబోస్ గారికి స్ర్కిప్ట్ నచ్చడంతో ఆరు పాటలను ఆయనే రాశారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ మా చిత్రానికి లిరిక్స్ రాయడం గ్రేట్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పాడు.