- మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యేల ప్రచారం
యాదాద్రి, వెలుగు: మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్ రెడ్డి కోరారు. ఆలేరు, భువనగిరి మున్సిపాలిటీల్లోని పలువార్డుల్లో వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు.
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినట్టయితే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడా ఆ పార్టీకి కొన్ని వార్డుల్లో గెలిపించినా ఉపయోగం ఉండదన్నారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.
