కృష్ణ వంశీ, మోక్ష జంటగా చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అలనాటి రామచంద్రుడు’. హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ టీజర్ను నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ‘అందరూ కొత్త టీమ్తో చేస్తున్న ఈ ప్రయత్నం బావుంది. ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే సినిమాని థియేటర్స్కి తీసుకెళ్లడం గొప్ప విషయం. టీజర్ ఆసక్తికరంగా ఉంది.
డైలాగ్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సినిమా కూడా అద్భుతంగా ఉండి, ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ రైడ్. సిద్దు అనే నిజాయితీ గల వ్యక్తి.. తన ప్రేమని చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. దాంతో తను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి ? తన ప్రేమని ఎలా చేరుకున్నాడనేది కథ. చక్కని వినోదం ఉంటుంది. ప్రేక్షకులు సినిమా చూసి, చాలా హాయిగా బయటికి వస్తారు’ అని చెప్పాడు.
అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోహీరోయిన్స్ థ్యాంక్స్ చెప్పారు. ‘టీమ్ అంతా చాలా ఎనర్జీతో పని చేసింది. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తప్పకుండా సినిమా ప్రేక్షకులని అలరిస్తుంది’ అని నిర్మాత శ్రీరామ్ జడపోలు అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.