రేపే నాందేడ్లో కేసీఆర్ బహిరంగ సభ

రేపే నాందేడ్లో కేసీఆర్ బహిరంగ సభ

మహారాష్ట్రలోని నాందేడ్లో రేపు బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. నాందేడ్‌ పట్టణంతో పాటు సభాస్థలికి వెళ్లే దారులన్నీ కిలోమీటర్ల మేర గులాబీమయమయ్యాయి. గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ సభకు హాజరుకానున్నారు. ఈ సభలో భారీ ఎత్తున చేరికలుంటాయని తెలుస్తోంది. గత 10 రోజులుగా నాందేడ్ లో మకాం వేసిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు వివిధ పార్టీల అసంతృప్త నేతలను కలిసి చర్చించారు.  సభ అనంతరం కేసీఆర్ తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో అధికార పార్టీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.