
- నిజమైన స్టూడెంట్లు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నరు
హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళ నలు చేస్తున్న వాళ్లంతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ అనుబంధ యూనియన్ వాళ్లేనని విప్ రాంచంద్రునాయక్ ఆరోపించారు. నిజమైన స్టూడెంట్లు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులను రెచ్చగొట్టేందుకు బీఆర్ఎస్ రాజకీయం చేస్తోం దని ఆయన మండిపడ్డారు.
గురువారం సీఎల్పీలో రాంచంద్రునాయక్ మీడియాతో మాట్లాడారు. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకొని.. అప్పుల పాలు చేసి ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని ఆయన ఫైర్అయ్యారు. జైల్లో ఉన్న కేసీఆర్ కూతురు కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం రాష్ట్రంలో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ కుట్రలో స్టూడెంట్లు పడొద్దని ఆయన సూచించారు.