పాత విధానంలోనే రాయితీలకు అవకాశం : రవిబాబు

పాత విధానంలోనే రాయితీలకు అవకాశం : రవిబాబు

సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా దళిత, గిరిజనుల్లో అర్హత కలిగిన యువకులందరికీ పాత విధానంలోనే రాయితీలు పొందే అవకాశం కల్పించాలని డీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రవిబాబు అన్నారు. ఈ విషయంపై బుధవారం కలెక్టరేట్ ఏవో రెహమాన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా అర్హత కలిగిన దళిత, గిరిజన లబ్ధిదారులు వాహనాలు, ఇతర సేవా రంగాలకు సంబంధించి కొనుగోలు చేసిన అనంతరం దరఖాస్తు చేసుకున్న వారికి రాయితీలు పొందే అవకాశం ఉండేదని, గత ప్రభుత్వం దళిత, గిరిజన అభివృద్ధి సంక్షేమానికి విరుద్ధంగా వ్యవహరించిందన్నారు. నూతన ప్రభుత్వం పాత పద్ధతిని అమలు చేసి దళిత, గిరిజన లబ్ధిదారులకు జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా రాయితీలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు బోయిని సదన్ మహరాజ్, జిల్లా కార్యదర్శి రాజు తదితరులు  పాల్గొన్నారు.