ఖైరతాబాద్, వెలుగు : వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో తాము అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తామని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్ కటకం మృత్యుంజయమ్ వెల్లడించారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
కవిత లిక్కర్స్కామ్ కేసుపై బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రధాని మోదీ ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.