వచ్చే ఎన్నికల్లో ​అన్నిస్థానాల్లో పోటీచేస్తం

వచ్చే ఎన్నికల్లో ​అన్నిస్థానాల్లో పోటీచేస్తం

ఖైరతాబాద్,​ వెలుగు :  వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో  తాము అన్ని  స్థానాల నుంచి  పోటీ  చేస్తామని   ఆలిండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ చైర్మన్​ కటకం మృత్యుంజయమ్ వెల్లడించారు. మంగళవారం ఆయన సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో మీడియాతో మాట్లాడారు. 

కవిత లిక్కర్​స్కామ్ కేసుపై బీజేపీ నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని  ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రధాని మోదీ ఏం చర్యలు తీసుకున్నారని  నిలదీశారు.  దళితుడిని సీఎం చేస్తానన్న హామీ ఏమైందో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.