ఓయూ, వెలుగు: ఇంటర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్లలాగే తమను కూడా రెగ్యులరైజ్చేయాలని కోరుతూ ఓయూలోని కాంట్రాక్ట్లెక్చరర్స్ గురువారం ఆర్ట్స్కాలేజీ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్లెక్చరర్ల సంఘం నాయకులు డా.పరశురామ్, డా.ధర్మతేజ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో ఏండ్లుగా పనిచేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వం రెండుసార్లు తమను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఇటీవల ఇంటర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల లెక్చరర్లను పర్మినెంట్చేసిందని, అదే విధంగా తమను కూడా చేయాలని కోరారు. దేశంలోని పలు యూనివర్సిటీలు కాంట్రాక్ట్ లెక్చరర్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు రెగ్యులరైజ్ చేశాయని చెప్పారు.
