కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  దేశంలోని అన్ని పంచాయతీలు ఇకపై అభివృద్ధి పనులకు, వసూళ్లకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది.  2023 ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి అన్ని పంచాయతీల్లో యూపీఐ సేవలు ప్రారంభించాలని పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన లేఖలో పేర్కొంది. 

ఈ కార్యక్రమాన్ని  ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్రప్రాంతాలకు సూచించింది.  డిజిటల్ చెల్లింపుపై శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. జూన్ 30న సర్వీస్ ప్రొవైడర్లు, వెండర్స్ తో సమావేశాలు నిర్వహించాలని పంచాయతీలను మంత్రిత్వశాఖ కోరింది. 

UPI ప్లాట్‌ఫారమ్‌లు జీపే, ఫోన్ పే, పేటీఎం, భీమ్, వాట్సాప్ పే, అమెజాన్ పే, భారత్ పేలకు సంబంధించివన సంబంధిత వ్యక్తుల వివరాలను మంత్రిత్వశాఖ షేర్ చేసింది. జూలై 15 నాటికి, మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం, పంచాయతీలు తగిన సర్వీస్ ప్రొవైడర్లను ఎన్నుకోవాలని, జూలై 30 లోపు వెండర్లని ఖరారు చేయాలని సూచించింది.

దేశంలో 98 శాతం పంచాయతీలు ఇప్పటికే యూపీఐ ఆధారిత చెల్లింపులను ఉపయోగించడం ప్రారంభించాయని పంపంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం(పీఎంఎఫ్ఎస్) ద్వారా దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయన్నారు. ఇకపై పంచాయతీలు డిజిటల్‌గా చెల్లింపులు జరగనున్నాయి. చెక్కులు, నగదు చెల్లింపులు దాదాపు ఆగిపోయాయన్నారు.