కామారెడ్డి, కామారెడ్డిటౌన్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా అన్ని పార్టీలు అడ్డు పడుతున్నాయని జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించారు. శనివారం కామారెడ్డిలో రిజర్వేషన్ల సాధన సమితి స్టేట్ ప్రెసిడెంట్ చిరంజీవి అధ్యక్షతన జరిగిన బీసీ ఆక్రోశ సభలో ఆయన మాట్లాడారు.
బీసీలకు రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ నాటకం ఆడుతోందన్నారు. రాజ్యంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీజేపీ మోకాలడ్డుతోందన్నారు. బీసీలంతా ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అగ్రవర్ణాలు రిజర్వేషన్లను అడ్డుకోవడం తగదన్నారు. విశారదన్ మహరాజ్మాట్లాడుతూ.. ఢిల్లీ వేదికగా యుద్ధం చేయాలని, ఇందులో సీఎం రేవంత్రెడ్డి, కేటీఆర్ ముందుండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విమలక్క, సినీ డైరెక్టర్ శంకర్, బీసీ నాయకులు బాల్రాజ్గౌడ్, భూమన్న, సిద్ధిరాములు పాల్గొన్నారు.
