- కలెక్టర్లే ప్రమోటర్లు.. నెల రోజుల నుంచి వెంచర్లలోనే అధికారుల తిష్ట
- ప్రైవేటుకు దీటుగా గేటెడ్ తరహాలో వెంచర్లు
- ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు అమ్మి 5 వేల కోట్లకుపైగా రాబట్టుకునేలా ప్రభుత్వం ప్లాన్
వెలుగు నెట్వర్క్: రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లతో రాష్ట్ర సర్కారు పక్కా రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్చేసింది. పదిహేనేండ్ల కింద సేకరించిన ఈ భూములను, కట్టిన ఇండ్లను అమ్మేసి రూ. 5 వేల కోట్లకు పైగా రాబట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నది. అందుకోసం ప్రైవేట్రియల్టర్లను మించిన ప్లాన్లతో ముందుకుపోతున్నది. ఈ పని కోసం హైదరాబాద్సహా అన్ని జిల్లాల్లో మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. సర్కారు ఆదేశాలతో ఫీల్డ్లో దిగిన కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు నెల రోజులుగా రాజీవ్స్వగృహ ఆస్తులను గేటెడ్ కమ్యూనిటీ తరహాలో వెంచర్లుగా డెవలప్చేయడంలో బిజీ అయ్యారు. పొద్దున లేచింది మొదలు అక్కడే కుర్చీలు, టేబుళ్లు వేసుకొని స్టాఫ్కు, కూలీలకు పనులు అప్పగిస్తున్నారు.
అటు వైపు పోతే చాలు.. ఉరికొచ్చి వివరిస్తరు..!
రోడ్ల వెంట ఆకట్టుకునే ఆర్చీలు, హంగూఆర్భాటాలు, హడావుడి చూసి అక్కడ ఆగడమే ఆలస్యం, వెంటనే హెల్ప్ డెస్క్ ల దగ్గరి రిసెప్షనిస్టులు పరుగెత్తుకొచ్చి చుట్టుముడుతున్నరు. ‘‘సార్.. ఓపెన్ ప్లాటు కావాలా? కొత్త ఫ్లాట్ కావాలా? ఎటువైపు కావాలి? ఏ రేటులో కావాలి?’’ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కలర్ఫుల్ బ్రోచర్లు చేతిలో పెట్టి కేటగిరీల వారీగా ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల గురించి వివరిస్తున్నారు. 15 ఏండ్ల కిందటి రాజీవ్ స్వగృహ ఆస్తులను డిపాజిటర్ల నుంచి స్వాధీనం చేసుకొని సర్కారే డెవలప్ చేసి అమ్ముతున్న వెంచర్ల వద్ద తాజాగా కనిపిస్తున్న దృశ్యాలివి. జిల్లా కలెక్టర్లే దగ్గరుండి మరీ వెంచర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగి ప్రైవేట్ వెంచర్లకు దీటుగా గేటెడ్ తరహా సౌకర్యాలను కల్పించడంలో బిజీ అయ్యారు.
ఖాళీ జాగాల్లో పిచ్చిచెట్లు, ముళ్లపొదలు తొలగించి సాఫ్చేయిస్తూ, లేఅవుట్లు వేయిస్తున్నారు. వెంచర్ల చుట్టూ గోడలు కట్టించి, గేట్లు పెట్టించి, ఆకట్టుకునే ఆర్చీలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. పనిలో పనిగా వెంచర్ల దగ్గరికి వచ్చే కొనుగోలుదారులకు కావాల్సిన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్కులు పెడుతున్నారు. ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్ల అమ్మకానికి సర్కారు నుంచి నోటిఫికేషన్ రాగానే, ఈ-–వేలం ద్వారా అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్లు చెప్తున్నారు.
అప్పట్ల పబ్లిక్ కోసం.. ఇప్పుడు పైసల కోసం..
2006లో ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నేర్చేందుకు ‘రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్థలాలు సేకరించి 3 బీహెచ్కే, 2.5 బీహెచ్కే, 2 బీహెచ్కే, 1 బీహెచ్కే ఫ్లాట్లు ఉండేలా అపార్ట్మెంట్లు కట్టి, నామినల్రేట్లకు అమ్మాలనుకుంది. ఈక్రమంలో హైదరాబాద్సహా జిల్లాల్లో ఇండ్లు కావాలనుకున్నవాళ్ల నుంచి రూ. 3 వేలు, రూ. 5వేల చొప్పున ప్రాసెసింగ్ఫీజుకట్టించుకొని అప్లికేషన్లు తీసుకుంది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని చాందానగర్, నాగోల్ బండ్లగూడ, పోచారం, జవహర్నగర్, గాజుల రామారంతో పాటు ఖమ్మం జిల్లా పోలేపల్లిలో 9 వేలకు పైగా 3 బీహెచ్కే, 2 బీహెచ్కే, సింగిల్బెడ్రూం ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 1,700 ఇండ్లు పూర్తిచేసి పోచారంలో 180 ఫ్లాట్లను, బండ్లగూడలో 500 ఫ్లాట్లను అమ్మారు. మరో వెయ్యి ఫ్లాట్ల వరకు అలాగే ఉండిపోగా, ఒక్క ఖమ్మంలోనే 576 ఫ్లాట్లు కట్టి ఖాళీగా పెట్టారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్నగర్, నల్గొండ లాంటి కొన్నిచోట్ల నిర్మాణాలు మొదలుపెట్టినా అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొన్ని పిల్లర్ల దశకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్స్వగృహను పూర్తిగా పక్కనపెట్టింది. తాము 15 ఏండ్ల కిందే అడ్వాన్స్చెల్లించినందున ప్రస్తుత మార్కెట్రేటుకు అటుఇటుగా తమకే అమ్మాలని డిపాజిట్దార్లు ఎన్నిసార్లు రిక్వెస్ట్చేసినా, ఆందోళనలు చేపట్టినా సర్కారు స్పందించలేదు. ఈలోగా హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లోనూ రాజీవ్ స్వగృహ భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అసలే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం, వీటిని తానే డెవలప్చేసి అమ్మితే వేల కోట్లు సంపాదించవచ్చని భావించింది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ఆలోచనను సర్కారు ఇటీవలే ఆచరణలో పెట్టింది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు అప్పట్లో డిపాజిట్లు కట్టినవాళ్లందరికీ అడ్వాన్స్తిరిగిఇస్తామని సమాచారం ఇచ్చారు. ఉదాహణకు కామారెడ్డిలో 543 ఫ్లాట్లకుగాను 580 మంది డిపాజిట్ చెల్లించారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్నుంచి పాత రశీదులు సేకరించిన ఆఫీసర్లు, డిపాజిట్దారుల ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. త్వరలోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు.
ప్రైవేటుకు దీటుగా..!
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కింద సేకరించిన భూములు (ఇప్పటికే కట్టిన అపార్ట్మెంట్లు, ఖాళీ జాగాలు కలిపి) 1,575 ఎకరాల వరకు ఉన్నట్టు ఆఫీసర్లు లెక్కతేల్చారు. జాగాలు, ఇండ్లు, వాటి మార్కెట్ రేట్లపై ఓ ప్రైవేట్ ఏజెన్సీద్వారా సర్వే చేయించారు. దాదాపు 150 ఎకరాలు లిటిగేషన్లో ఉండగా, 19 చోట్ల 820 ఎకరాలు క్లియర్గా ఉన్నట్టు ఈ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఖాళీ జాగాలను ప్లాట్లు చేసి అమ్మడం ద్వారా రూ. 2,412 కోట్లు, ఇప్పటికే కట్టిన, అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, అపార్ట్మెంట్లను అమ్మడం ద్వారా రూ. 2,913 కోట్లు.. ఇట్లా మొత్తంగా రూ. 5,325 కోట్లు రాబట్టాలని సర్కారు టార్గెట్పెట్టుకొంది. ఈ బాధ్యతను కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులపై పెట్టింది. అనుకున్న రేటు రావాలంటే లే అవుట్లు ఆకట్టుకునేలా ఉండాలని భావించిన ఆఫీసర్లు వారం, పది రోజులుగా రాష్ట్రంలోని అన్ని వెంచర్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంపచెట్లతో నిండిన ఏరియాలను క్లీన్చేసి ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నారు. ప్లాట్లకు కొలతలు వేసి నంబర్లు కేటాయిస్తున్నారు. కంపౌండ్ వాల్స్, ఆర్చీలు, గేట్లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోల్స్ వేసి ఎలక్ట్రిక్ లైన్లు లాగుతున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ, ఆర్అండ్ బీ, మున్సిపల్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చ్రర్ డెవలప్మెంట్, సర్వే ల్యాండ్ రికార్డు ఆఫీసర్లు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. వెంచర్ల దగ్గర హెల్ప్ డెస్క్లు పెట్టి.. స్టాఫ్ను అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవాళ్లకు వెంచర్ హైలెట్స్ చెప్తూ వారి ఫోన్నంబర్లు, వివరాలు నోట్ చేసుకుంటున్నారు. ఇండ్లు, ఫ్లాట్లు చూసుకోవచ్చని చెప్తున్నారు.
త్వరలో ఈ–వేలం
రాజీవ్ స్వగృహ వెంచర్లలోని ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలను ఈ–వేలం పద్ధతిలో అమ్మేందుకు రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామని కలెక్టర్లు చెప్తున్నారు. అన్ని వివరాలు ఎంఎస్టీసీ వెబ్సైట్లో పెట్టామని చెప్తున్నారు. నోటిఫికేషన్ ఇవ్వగానే ఎంఎస్టీసీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే చాన్స్ కల్పిస్తామని, వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అంటున్నారు. కాగా, సర్కారు తీరుపై 15 ఏండ్ల కింద ఫ్లాట్ల కోసం అడ్వాన్స్ కట్టిన డిపాజిట్దారులు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తుందనే ఆశతో ఇన్నాళ్లూ ఎదురుచూశామని, ఇండ్లు కట్టివ్వకున్నా మార్కెట్రేటుకు తమకే ఇస్తారని ఆశపడ్డామని, సర్కారే వేలం వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.