257 మంది ప్రొబేషనరీ డీటీలకు జిల్లాల కేటాయింపు

257 మంది ప్రొబేషనరీ డీటీలకు జిల్లాల కేటాయింపు

హైదరాబాద్, వెలుగు : నాలుగు నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న 257 మంది ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్లకు ప్రభుత్వం ఎట్టకేలకు జిల్లాలు కేటాయించింది. లాక్ డౌన్ కు ముందే వీళ్లకు ట్రైనింగ్ అయిపోయింది. అప్పటి నుంచి పోస్టింగ్ లు ఇవ్వలేదు. వీరితోపాటే గ్రూప్ –2లో ఉద్యోగాలు పొందిన అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ), ఎక్సైజ్ఇన్ స్పెక్టర్, సబ్ రిజిస్ట్రార్ సహా 16 కేటగిరీల్లో వారు ఏడాది క్రితమే జాబ్ లో జాయిన్ అయ్యారు. డీటీలు మాత్రం ఇంకా పోస్టింగ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇనిస్టిట్యూషనల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరికి ఎట్టకేలకు జిల్లాలు కేటాయించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం