పుష్ప ది రైజ్ అంటూ రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్కు ఈ సినిమా.. తన కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలవడంతోపాటు, తనకు జాతీయస్థాయి అవార్డు తెచ్చి పెట్టిన చిత్రంగా నిలిచింది. దీంతో సీక్వెల్గా తెరకెక్కుతోన్న ‘పుష్ప ది రూల్’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ చిత్రం విడుదల వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దీనికి చెక్ పెట్టేలా సోమవారం టీమ్ మరోసారి రిలీజ్ డేట్ను కన్ఫర్మ్ చేశారు. ‘కౌంట్ డౌన్ స్టార్ట్.. రెండొందల రోజుల్లో పుష్ప రూల్స్ బిగిన్’ అంటూ తాము చెప్పిన డేట్ (ఆగస్టు 15)కు వచ్చి తీరుతామని అప్డేట్ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్లో నటించిన నటీనటులే దాదాపు ఇందులోనూ నటిస్తున్నారు. పుష్ప రాజ్ భార్య శ్రీవల్లి పాత్రలో రష్మిక కనిపించనుండగా, సెకెండ్ పార్ట్లో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్గా ఉండబోతోందని టీమ్ చెబుతోంది. జగదీష్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.