
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ టెక్నీషియన్స్తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే నటీనటులను సెలెక్ట్ చేయడం, లుక్ టెస్టులు చేయడంతో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. దీంతో షూటింగ్కు ముహూర్తం ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఫస్ట్ షెడ్యూల్ను ముంబైలో మొదలుపెట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికోసం ఓ భారీ సెట్ను వేశారని అక్కడే మూడు నెలలు దీన్ని చిత్రీకరించనున్నారట. ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతోపాటు యాక్షన్ సీన్స్ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
తర్వాత ఫారిన్లో వీఎఫ్ఎక్స్ పనులు, పలు ఇంపార్టెంట్ సీన్స్ను చిత్రీకరించేలా సన్నాహాలు చేస్తున్నారట. అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా ఇది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందనున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్లో కనిపించబోతున్నట్టు సమాచారం. అలాగే ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీపికా పదుకొనె ఫీమేల్ లీడ్గా నటించనుందని ప్రకటించారు. మరో ఇద్దరు హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, అనన్య పాండేల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.