సూర్యాపేట, వెలుగు: అవినీతిమయంగా మారిన రాజకీయాలలో మార్పు కోసమే తనతోపాటు చాలామంది రాజకీయాల్లోకి రానున్నట్లు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో వనరులు ఉన్నా 75 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందలేదని, నాయకుల అవినీతి కారణంగా వనరులను వినియోగించుకోలేని స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ రాజకీయాలు యువతతోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ ఫోరం నాయకులు డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్, బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య, టీవీవీ జిల్లా అధ్యక్షులు గుండాల సందీప్, టీఎస్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్, జన సేవా సమితి అధ్యక్షులు తగుళ్ల జనార్ధన్ యాదవ్, ఆర్వీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్ తదితరులు పాల్గొన్నారు.