అల్వాల్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం  

అల్వాల్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం  

అల్వాల్ లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.  అల్వాల్ సర్కిల్ పరిధిలోని అంజనాపురి కాలనీ, ఓల్డ్ ఆల్వాల్, సూర్య నగర్, తుర్కపల్లి ,మచ్చ బొల్లారం కాలనీలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. అంజనాపురి కాలనీలో ఓ వాహనదారుడి బైక్  కొట్టుకుపోయింది. అప్రమత్తమైన మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. 

ఇక  హైదరాబాద్ నగరంలోని ముసారాం బాగ్ బ్రిడ్జ్ పై వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో కోఠి నుంచి మలక్ పేట్ వెళ్లే వాహనా దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది... వాటర్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.  శివరాం పల్లిలో ఇప్పటి వరకు అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాజేంద్ర నగర్ లో 3.5, మలక్ పేట్, చార్మినార్, శాస్త్రీపురంలో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వచ్చే నాలుగు రోజులు కీలకమన్నారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో 24 గంటల్లో అల్పపీడన ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెర్టర్ నాగరత్న తెలిపారు.