బీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం?

బీజేపీలో పంజాబ్ లోక్ కాంగ్రెస్ విలీనం?

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సొంత కుంపటి పెట్టుకున్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ సర్జరీ కోసం లండన్లో ఉన్న ఆయన వచ్చే వారం భారత్ కు తిరిగి రానున్నారు. స్వదేశానికి తిరిగి వచ్చిన వెంటనే ఆయన తన పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. సర్జరీ అనంతరం కోలుకుంటున్న అమరీందర్ కు ఆదివారం ప్రధాని నరేంద్రమోడీ ఫోన్ చేసి మాట్లాడారు. 

కెప్టెన్ అమరీందర్ సింగ్ దాదాపు ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.గతేడాది సీఎం పదవి నుంచి ఆయనను తప్పించడంతో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. అప్పట్లోనే ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వచ్చినా అమరీందర్ వాటిని ఖండించారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. ఈ ఏడాది జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పటియాలా స్థానం నుంచి పోటీ చేసిన అమరీందర్ ఓటమి పాలయ్యారు.