ఫేస్ మాస్క్ బిజినెస్ లో అమెజాన్,ఫ్లిప్ కార్ట్, గ్రోఫర్స్

ఫేస్ మాస్క్ బిజినెస్ లో అమెజాన్,ఫ్లిప్ కార్ట్, గ్రోఫర్స్
  • ఫ్లిప్‌‌ కార్ట్, అమెజాన్, మింత్రాలకు కొత్త బిజినెస్ అవకాశం
  •  బిగ్‌‌ బాస్కెట్, గ్రోఫర్స్ , రిలయన్స్ రిటైల్స్ ద్వారా పెద్ద ఎత్తున అమ్మకం
  • ఫేస్ మాస్కు‌‌లు ప్రస్తుతం కొత్తఫ్యాషన్ కేటగిరీ తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, ఒడిశా, చండీగఢ్‌లో ప్రజలు మాస్కులను ధరించడం తప్పనిసరి

అవసరమే ఏవ్యాపారానికైనా తల్లిలాంటిది. ఆ అవసరాన్ని క్యాష్ చేసుకునేందుకే అన్ని కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు అవసరం ఏంటంటే.. ఫేస్ మాస్కు‌‌లు. రిటైల్ నుంచి పెద్ద ఫ్యాషన్, లైఫ్‌ స్టయిల్ కంపెనీల వరకు ఇప్పుడు దృష్టంతా ఫేస్‌ మాస్కుల పైపుకు మళ్లింది. ఈ కంపెనీలు ప్రస్తుతం ఫేస్ మాస్కు‌‌లు అమ్మడం ప్రారంభించాయి. ఫేస్ మాస్కు‌‌లు అమ్మే కంపెనీల్లో ఇప్పుడు పెద్ద పెద్ద ఈ– కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌‌ కార్ట్ ,మిత్రా, బిగ్‌‌బాస్కెట్, రిలయన్స్ రిటైల్, గ్రోఫర్స్‌‌ వచ్చిచేరాయి. తెలంగాణ, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా, చండీగఢ్‌‌లో ప్రజలంతా ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి. దీంతో వీటికి డిమాండ్ విపరీతంగా పెరిగి కొరత ఏర్పడింది. మాస్కుల ప్రొడక్షన్ పెంచడమని అప్పరెల్ బ్రాండ్లను, సప్లయిర్స్ ను అమెజాన్, ఫ్లిప్‌‌ కార్ట్ లు‌ ఆదేశిస్తున్నాయి. అప్పరెల్ కంపెనీలకు కూడా మాస్కుల కోసం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి.

  • అన్ని కంపెనీలకూ మాస్కులు ముఖ్యం..

ఇప్పుడు ఈ కంపెనీల కోర్ ప్రొడక్టులు‌ కూడా మాస్కు‌‌లుగానే మారాయని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. సెల్లర్స్ ద్వారా ప్రైవే బ్రాండ్ల మాస్కు‌‌ లను అమ్మడం అమెజాన్, ఫ్లిప్‌‌ కార్ట్‌‌ లు  ప్రారంభించాయి. లాక్‌‌డౌన్ కారణంతో ఫ్లిప్‌‌ కార్ట్‌‌ కు ‌ చెందిన మింత్రా తన సర్వీసులను రద్దు చేసింది. కానీ ఈ వారం నుంచి మాస్కులను డెలివరీ చేయడం ప్రారంభించింది. మరిన్ని ఫేస్ మాస్కుల సప్లయి కోసం టాప్ బ్రాండ్లతో చర్చిస్తున్నట్టు మింత్రా సీఈవో అమర్ చెప్పారు. గ్రోఫర్స్ కూడా మాస్కులను అమ్ముతోం ది. రిలయన్స్ రిటైల్ కూడా మాస్కులను అమ్మేందుకు చూస్తోంది. బిగ్‌‌బాస్కెట్ కూడా తన ప్లాట్‌‌ఫామ్‌‌పై డిస్పోజబుల్ యాంటీ పొల్యుషన్ మాస్కులను ప్రవేశపెడుతోంది. పలు అప్పరెల్‌‌ ఎక్స్ పోర్టులు కూడా లాక్‌ ‌డౌన్ కారణంతో తమ యూనిట్లను క్లోజ్ చేసుకున్నాయి. కానీ ప్రస్తుతం వాటిని తెరుస్తున్నాయి. గత వారం నుంచి మాస్కుల మానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తిరుపూర్‌ మారింది.

 500-600 కోట్ల మాస్కు‌‌లు అమ్ముడుపోతాయ్..!

కరోనా వ్యాధి వల్ల గత నెల నుంచి ఇండియాలో మాస్కు‌‌లు, హ్యాండ్ శానిటైజర్స్, టాయిలెట్ క్లీనర్ వంటి హైజీన్ ప్రొడక్ట్ ల‌ విక్రయాలు బాగా పెరిగినట్టు మార్కెట్ రీసెర్చర్ నీల్సన్ రిపోర్ట్ చేసింది. భవిష్యత్తులో 500 కోట్లనుంచి 600 కోట్ల వరకు మాస్కులను అమ్ముడుపోయే అవకాశం ఉందని డెనిమ్ కన్సల్టెంట్ సందీప్ అగర్వాల్ తెలిపారు. సర్జికల్ మాస్కులకు కూడా డిమాండ్ బాగా ఉందన్నా రు. టెక్స్ట్ టైల్ ఇండస్ట్రీకి ఈ ఏడాది నుంచి వస్తోన్న నష్టాలను ఫేస్ మాస్కులు కాస్త తగ్గించనున్నాయని అగర్వాల్ అన్నారు.