రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌తో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌తో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

సుహాస్, శివాని నాగరం జంటగా దుశ్యంత్ కటికినేని తెరకెక్కించిన చిత్రం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది. బుధవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. హీరో సుహాస్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది. దీనికోసం రెండు సార్లు గుండు చేయించుకున్నా.

బ్యాండ్ కొట్టడం నేర్చుకున్నా. సినిమాలోని చాలా సీన్స్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకులు తమ రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లోని ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ను గుర్తు చేసుకుంటారు’ అని చెప్పాడు. ‘థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో డబుల్ ధమాకాలా ఉంటుందని ప్రామిస్ చేస్తున్నా’ అని హీరోయిన్ శివాని చెప్పింది. దర్శకుడు దుశ్యంత్ మాట్లాడుతూ ‘కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ఈ సినిమా తీశా. లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీతో పాటు ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌ డ్రామా ఉంటుంది’ అని చెప్పాడు. ‘సుహాస్ తో పాటు నటీనటులంతా అద్భుతంగా నటించారు.

టెక్నీషియన్స్ బెస్ట్‌‌‌‌‌‌‌‌ వర్క్ ఇచ్చారు. మా సంస్థలో ‘బేబి’ లాంటి బ్లాక్‌‌‌‌‌‌‌‌ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇచ్చిన ప్రేక్షకులు ఈ సినిమాతో మరో సూపర్ హిట్ ఇస్తారని ఆశిస్తున్నాం’ అని నిర్మాత ధీరజ్ అన్నారు. నటీ నటులు శరణ్య ప్రదీప్, నితిన్, కిట్టయ్య, సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, ఎడిటర్ కొదాటి పవన్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.