ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుగుతోంది. అయితే అంబానీ ఫ్యామిలీని బెదిరించింది తామేనని జైషుల్ హింద్ అనే సంస్థ ప్రకటించింది. అంబానీ హౌస్కు సమీపంలో పేలుడు పదార్థాలతో పార్క్ చేసిన వాహనం తమదేనని స్పష్టం చేసింది. ఆన్లైన్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ ద్వారా జైషుల్ ఈ విషయాన్ని తెలిపింది. ఇది ఓ ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు అసలు సినిమా చూపించబోతున్నామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఎస్యూవీని పార్క్ చేసిన వ్యక్తి సేఫ్ హౌజ్కు చేరుకున్నాడని, అతడు సురక్షితంగా ఉన్నాడని జైషుల్ మెసేజ్లో పేర్కొంది.
కాగా, అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న ఓ ఎస్యూవీని గురువారం పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో పోలీసులు విచారణ చేపట్టగా.. అంబానీ కుటుంబాన్ని బెదిరించేందుకు ఎవరో కావాలనే ఇలా చేశారని, ఇందులో రెండు వెహికిల్స్ను వాడారని తేలింది. ఆ వాహనాల్లో నుంచి 20 గెలాటిన్ స్టిక్స్తోపాటు కొన్ని నంబర్ ప్లేట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని నంబర్ ప్లేట్లు అంబానీ ఫ్యామిటీ సెక్యూరిటీ టీమ్ వాడిన నంబర్ ప్లేట్లను పోలి ఉన్నాయని తెలుస్తోంది.