టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటనపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.చంద్రబాబు అధికారం కోసం ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అధికారం కావాలనే అతృతతో గందరగోళాలు సృష్టిస్తున్నారన్నారు. పుంగనూరులో పోలీసులపై దాడి దారుణం అన్నారు. పుంగనూరులో వైఎస్సాఆర్ పార్టీ కార్యకర్తలకు, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలకు మధ్య జరిగినటువంటి తగాదా కాదన్నారు. అది పోలీసులకు చంద్రబాబుకు మధ్య జరిగిన తగాదా అని పేర్కొన్నారు.
చంద్రబాబు అర్ధాంతరంగా తన రూట్ ను మార్చుకుని పుంగనూరు రావాలని అనుకోవడమే ఆయన చేసిన తప్పు అన్నారు.రూట్ మ్యాప్ విషయంలో చంద్రబాబు అతిక్రమించారని తెలిపారు. చంద్రబాబుకు బుర్ర పని చేయడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సింహమంటే నవ్వు వస్తుందన్నారు. సింహంతో చంద్రబాబు పోల్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.