ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయవాడకు చేరుకోవడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేత నారా లోకేశ్తో కలిసి ప్రశాంత్ కిశోర్ .. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. చంద్రబాబు-పీకే సమావేశం కావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు చేశారు. ‘మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రీ ఏం చేయగలడు?’ అంటూ ట్వీట్ చేశారు.కొన్ని గంటల క్రితం అంబటి మరో ట్వీట్ చేశారు. ఒకరు ప్యాకేజీ కోసం, ఒకరు పుత్రుడి కోసం అంటూ పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఒకే ఒక్కరు జగన్ మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఒకడు ప్యాకేజీ కోసం @PawanKalyan
— Ambati Rambabu (@AmbatiRambabu) December 22, 2023
ఒకడు పుత్రుడు కోసం @ncbn
ఒకే ఒక్కడు ప్రజల కోసం @ysjagan
ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీడీపీ యువనేత నారా లోకేశ్, ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో విజయవాడ రావడం, ఒకే వాహనంలో ఇరువురు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లడం, ఆపై చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.