3 రోజుల్లో అంబర్పేట ఎస్టీపీ ప్రారంభం.. తుది దశ పనులు పూర్తి చేయండి : వాటర్ బోర్డు ఎండీ

3 రోజుల్లో అంబర్పేట ఎస్టీపీ ప్రారంభం.. తుది దశ పనులు పూర్తి చేయండి : వాటర్ బోర్డు  ఎండీ
  • బల్దియా కమిషనర్​తో కలిసి పనుల పరిశీలన

హైదరాబాద్​సిటీ, వెలుగు: అంబర్ పేటలో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవ‌‌‌‌‌‌‌‌రేజి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) నిర్మాణ‌‌‌‌‌‌‌‌ ప‌‌‌‌‌‌‌‌నుల‌‌‌‌‌‌‌‌ను వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, బల్దియా కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్, ఎంఆర్డీసీఎల్​ ఎండీ నర్సింహా రెడ్డి, వాటర్​బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, ఇతర శాఖల అధికారులు విజిట్​చేశారు. తుది దశలో ఉన్న పనుల్లో వేగంపెంచి మూడు రోజుల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం సుబ్రహ్మణ్యం ఉన్నారు.