
- బల్దియా కమిషనర్తో కలిసి పనుల పరిశీలన
హైదరాబాద్సిటీ, వెలుగు: అంబర్ పేటలో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ) నిర్మాణ పనులను వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్డి, బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఎంఆర్డీసీఎల్ ఎండీ నర్సింహా రెడ్డి, వాటర్బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్, ఇతర శాఖల అధికారులు విజిట్చేశారు. తుది దశలో ఉన్న పనుల్లో వేగంపెంచి మూడు రోజుల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. బోర్డు ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం సుబ్రహ్మణ్యం ఉన్నారు.