ఏప్రిల్ 25న తెలంగాణకు అమిత్ షా

ఏప్రిల్ 25న తెలంగాణకు అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది.  ఏప్రిల్ 25వ తేదీ గురువారం రోజున  తెలంగాణకు రానున్నారు.  ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు . తిరిగి  అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.45కు సిద్దిపేట చేరుకుంటారు.  మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో  అమిత్ షా పాల్గొంటారు.  గంటపాటు బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.  మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేటకు బయలుదేరుతారు.  లంచ్ తర్వాత 2.15 నిమిషాలకు బేగంపేట నుంచి భువనేశ్వర్ కు వెళ్లనున్నారు అమిత్ షా. తెలంగాణలో 14 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.