దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుంది: అమిత్ షా

దేశంలో అవినీతి రహిత పాలన కొనసాగుతుంది: అమిత్ షా

2025 నాటికి మనదేశం ఖచ్చితంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని కేంద్రం హోం మినిస్టర్ అమిత్ షా అన్నారు. గత ఎనిమిదేండ్లల్లో దేశం అభివృద్ధివైపు పరుగులు తీస్తోందన్నారు. తమిళనాడులో ఇండియా సిమెంట్ ప్లాటీనం జూబ్లీ వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు.

2027 నాటికి మన దేశం అతిపెద్ద మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందన్నారు. సమర్ధవంతమైన, పారదర్శక విధానాల కారణంగా దేశం పురోగమిస్తోందన్నారు. రాజకీయ స్థిరత్వం, అవినీతి రహిత పాలన దేశంలో కొనసాగుతుందని అమిత్ షా తెలిపారు.