డిసెంబర్ 28న తెలంగాణకు అమిత్ షా రాక.. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్

 డిసెంబర్ 28న తెలంగాణకు అమిత్ షా రాక.. లోక్సభ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్

లోక్ సభ ఎలక్షన్స్ పై బీజేపీ అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కొంగరకలాన్ శ్లోకా కన్వెన్షన్ లో పార్లమెంట్ ఎన్నికలపై అమిత్ షా.. రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. 

మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు వెయ్యి మందితో అమిత్ షా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. మూడోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి.. మోదీని హ్యాట్రిక్ ప్రధానమంత్రిని చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా మీటింగ్ కు బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.