రేపు రాత్రి హైదరాబాద్ కు అమిత్ షా

రేపు రాత్రి హైదరాబాద్ కు అమిత్ షా

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. రేపు రాత్రి 10 గంటలకు ఆయన నగరానికి చేరుకుంటారు. సెప్టెంబర్ 17న  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరవుతున్నారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాదులోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 

రేపు రాత్రి హైదరాబాదుకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే సభకు హాజరవుతారు. ఉదయం 8.45 నుంచి 11.45 వరకు పరేడ్ గ్రౌండ్ లోనే ఉంటారు. సభ అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి టూరిజం ప్లాజా కు బయలుదేరుతారు. టూరిజం ప్లాజాలో మోడీ పుట్టిన రోజు సందర్భంగా వికలాంగులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేస్తారు. సాయంత్రం పోలీస్ అకాడమీకి చేరుకోనున్న అమిత్ షా... అక్కడి నుంచి రాత్రి ఢిల్లీకి తిరిగి వెళతారు.