కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 15.. ఏప్రిల్ 29నుంచి రిజిస్ట్రేషన్స్ షురూ

 కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 15.. ఏప్రిల్ 29నుంచి రిజిస్ట్రేషన్స్ షురూ

ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 15 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఓ ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఏప్రిల్ 29న రాత్రి 9గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ ప్రోమోలో ఒక మహిళ హాట్ హాట్‌కి చేరుకోవడానికి మార్గాన్ని కనుగొనడానికి మ్యాప్‌లో చూస్తుంది. అలా భూమిని తవ్వి సెట్స్‌కి చేరుకుంటుంది. అక్కడకు చేరుకోగానే సెట్స్ లో కూర్చున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు.

అప్పుడు ఆమె తనతో గేమ్ ఆడమని అడగగా.. హాట్‌సీట్‌ను చేరుకోవడానికి జిమ్మిక్కులను ఉపయోగించవద్దని  అమితాబ్ చెప్తారు. గేమ్ ఆడాలంటే ఏప్రిల్ 29న రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచిస్తారు. అదే సమయంలో ప్రేక్షకుల వైపుకి తిరిగి  రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని, కాబట్టి ఫోన్ తీయండి అని చెప్పడం ఈ ప్రోమోలో కనిపిస్తోంది. దాంతో పాటు "నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి, మీ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది" అని హోస్ట్ గా ఉన్న బిగ్ బీ చెప్పడం అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది.

డిసెంబర్ 30, 2022న కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 14  ముగిసింది. అక్షయ్ కుమార్, పద్మశ్రీ DG ప్రకాష్ సింగ్ నుంచి విక్కీ కౌశల్, కియారా అద్వానీ లాంటి చాలా మంది అమితాబ్ బచ్చన్ షోకు వచ్చి, ఆడియెన్స్ ను అలరించారు. ఈ కార్యక్రమం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్‌లో ప్రసారం అవుతుంది.