కూసుమంచి, వెలుగు : పీఏసీఎస్, ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా రైతులకు సరిపడా అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనిఏడీఏ సతీశ్, ఏవో వాణి రైతులకు సూచించారు. శుక్రవారం మండలంలో జీళ్లచెరువు, చేగోమ్మ సొసైటీలు, ప్రైవేట్ఎరువుల దుకాణాలను అధికారులు సందర్శించి యూరియా స్టాక్ను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకున్న యూరియాను ఒక్క రోజే 4,813 బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. చదువురాని రైతులకు ఏఈవోలు, వలంటీర్లు యాప్లో బుక్చేసేందుకు అందుబాటులో ఉంటారని చెప్పారు. వారి వెంట ఏఈవో రవీందర్, సొసైటీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
