
- కాళేశ్వరం డిజైన్లను సీడబ్ల్యూసీ అప్రూవ్ చేయలేదు
- ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు
- ప్రాజెక్టు వ్యయంపై ప్రశ్నిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాట వేసింది
- తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఏనాడూ సీడబ్ల్యూసీ చెప్పలేదు
- బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు
- మేడిగడ్డ సమాచారం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు
- మెయింటనెన్స్ లేక శ్రీశైలం, సాగర్కు ముప్పు ఉందని హెచ్చరిక
- సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్
- చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్రం
- వారంలో బ్యారేజీ పరిశీలన..
- నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక
- కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ కోసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఎక్స్పర్ట్, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్అయ్యర్నేతృత్వంలో నిపుణులకమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. ఈ కమిటీ వారం రోజుల్లోనే బ్యారేజీని సందర్శిస్తుందన్నారు. నాలుగు నెలల్లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని కమిటీని కేంద్రం ఆదేశించిందని తెలిపారు. బ్యారేజీ కుంగుబాటుపై నెల రోజుల్లోనే కమిటీ ప్రాథమిక నివేదిక ఇస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, అది నిజం కాదని తేల్చిచెప్పారు.
‘‘తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అంతర్భాగమైన సెంట్రల్ డిజైన్స్ఆర్గనైజేషన్ మాత్రమే డిజైన్లను అప్రూవ్ చేసింది. సీడబ్ల్యూసీ దాన్ని ఆమోదించలేదు. డిజైన్ ఫెయిల్యూర్కు సీడబ్ల్యూసీకి ఎలాంటి సంబంధం లేదు. ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్క్లియరెన్స్ కూడా సీడబ్ల్యూసీ ఇవ్వలేదు” అని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని సీజీవో టవర్స్లో మీడియాతో వెదిరె శ్రీరామ్ మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత, గోదావరిపై ప్రాజెక్టులు, కృష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు తదితర అంశాలపై పవర్పాయింట్ప్రజంటేషన్ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగి నాలుగు నెలలు గడిచిందని, ఇప్పటి వరకు బ్యారేజీకి సంబంధించిన సమాచారం రాష్ట్రం నుంచి రావడం లేదని అన్నారు.
‘‘గతేడాది అక్టోబర్21న మేడిగడ్డ బ్యారేజీ కుంగితే రెండు రోజుల్లోనే ఎన్డీఎస్ఏ టీమ్వచ్చి బ్యారేజీని పరిశీలించింది. బోట్లో వెళ్లి కుంగిన బ్యారేజీ ప్రాంతాన్ని పరిశీలించేందుకు టీమ్ ప్రయత్నిస్తే ఇక్కడి అధికారులు, ఇంజనీర్ల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. బ్యారేజీకి సంబంధించి 20 రకాల డేటా ఇవ్వాలని కోరితే అప్పటి బీఆర్ఎస్ప్రభుత్వం కొన్ని వివరాలు మాత్రమే ఇచ్చింది. పది రోజుల కింద మిగతా డేటా ఇవ్వాలని కోరితే ప్రస్తుత కాంగ్రెస్ప్రభుత్వం కూడా ఆ వివరాలు ఇవ్వడం లేదు” అని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి ముందు జియోలాజికల్ప్రొఫైల్ సర్వే చేయలేదని, ఎన్జీఆర్ఐ సపోర్టు కూడా తీసుకోలేదని ఆయన తప్పుబట్టారు. ‘‘బ్యారేజీ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యిందో.. బ్లాక్ల వారీగా వర్క్కంప్లీషన్సర్టిఫికెట్లు, థర్డ్పార్టీ క్వాలిటీ కంట్రోల్, వర్షాకాలం ప్రారంభానికి ముందు.. తర్వాత చేసిన ఇన్స్పెక్షన్సహా ఇతర వివరాలేవి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఎన్డీఎస్ఏకు ఇవ్వలేదు” అని అన్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని ఎప్పుడూ చెప్పలే
తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీనే చెప్పినట్లు బీఆర్ఎస్పేర్కొంటున్నదని, ఇది అవాస్తవమని వెదిరె శ్రీరామ్ అన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ అప్పుడు, ఇప్పుడూ చెప్తున్నది. రూ.40వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్పేరుతో రూ.80 వేల కోట్లకు పెంచి కేంద్రానికి డీపీఆర్పంపారు. ప్రాజెక్టు వ్యయం అంతలా ఎందుకు పెరుగుతుందని కేంద్రం ప్రశ్నిస్తే.. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తమ రాష్ట్ర సొంత నిధులతో ప్రాజెక్టు నిర్మిస్తున్నాం కాబట్టి ఆ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని దాట వేసింది. అందుకే ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ను సీడబ్ల్యూసీ ఇవ్వలేదు” అని తెలిపారు.
తుమ్మడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్తూ మేడిగడ్డకు ప్రాజెక్టు సైట్ను అప్పటి బీఆర్ఎస్ సర్కార్ మార్చిందని ఆయన అన్నారు. ప్రాణహిత – చేవెళ్ల హెడ్వర్క్స్లేకుండానే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.11,917 కోట్లు ఖర్చు చేశాయని, రీ ఇంజనీరింగ్తో అందులో ఎక్కువ పనులు తిరిగి ఉపయోగించుకునే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించకపోవడం కాంగ్రెస్, బీఆర్ఎస్ప్రభుత్వాల వైఫల్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉంటే చర్చలు జరిపి ఒప్పించేదని పేర్కొన్నారు.
స్టెబిలైజేషన్ లెక్కలన్నీ గందరగోళం
హెడ్వర్క్స్లేకుండా ప్రవహించే నీటి ఆధారంగా దేశంలో నిర్మించిన ఏకైక ప్రాజెక్టు దేవాదుల మాత్రమేనని వెదిరె శ్రీరామ్ తెలిపారు. కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాల్సి ఉండగా బీఆర్ఎస్ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుపాకులగూడెం వద్ద బ్యారేజీని నిర్మించిందని అన్నారు. ఇక్కడ 83 మీటర్ల లెవల్లో నీటిని నిల్వ చేయడానికి చత్తీస్గఢ్అభ్యంతరం చెప్తున్నదని పేర్కొన్నారు. ఆ రాష్ట్రాన్ని ఒప్పించడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం కేంద్రాన్ని సంప్రదించలేదని ఆయన అన్నారు.
తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణంతో ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. ఎస్సారెస్పీ స్టేజీ –2 ఆయకట్టును కాళేశ్వరం, దేవాదుల కింద స్టెబిలైజ్చేస్తామని చూపించారని, ఆయకట్టు స్టెబిలైజేషన్లెక్కలన్నీ గందరగోళంగా ఉన్నాయన్నారు. వేల కోట్లు ఖర్చు చేసినా దేవాదుల ఆయకట్టుకు నీళ్లు రాలేదని తెలిపారు. తనకు వరంగల్జిల్లాలో ఐదెకరాల భూమి ఉందని, ఇప్పటి వరకు ఆ పొలానికి దేవాదుల నీళ్లు రాలేదని వెదిరె శ్రీరామ్ అన్నారు.
ఇన్వెస్టిగేషన్లు లేకుండా రిపేర్లపై నిర్ణయం తీసుకోలేం
జియో ఫిజికల్, జియో టెక్నికల్ఇన్వెస్టిగేషన్లు చేయకుండా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజీలో ఎక్కువ డ్యామేజీలు ఉంటే ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి దాని బ్యాక్వాటర్తో కాళేశ్వరం పంపులు రన్చేయవచ్చన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా మంచిదేనని తెలిపారు. ముంపుపై మహారాష్ట్ర తో సంప్రదింపులు జరపాలని కేంద్రాన్ని కోరితే తాము చర్చించి ఒప్పించేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.
కృష్ణా జలాలను మళ్లీ పంపిణీ చేస్తం
బచావత్ ట్రిబ్యునల్ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీలతో పాటు బ్రజేశ్ట్రిబ్యునల్సిఫార్సు చేసిన 190 టీఎంసీలను కలిపి కొత్త ట్రిబ్యునల్తెలంగాణ, ఏపీకి పునః పంపిణీ చేస్తుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ వెల్లడించారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కొత్త ట్రిబ్యునల్తోనే పరిష్కారమవుతుంది. తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం కొత్త ట్రిబ్యునల్వద్ద బలమైన వాదనలు వినిపించాలి.
ఏడాది వ్యవధిలోనే నీటి పంపకాలు చేయాలని మేము కొత్త ట్రిబ్యునల్ను కోరుతున్నం. నీటి వాటాల పంపకాలపై కొత్త చట్టం త్వరలోనే రాబోతున్నది. అది అమల్లోకి వస్తే మూడేండ్లలోనే ఏదైనా ఓ ట్రిబ్యునల్నీటి వాటాలు తేల్చుతూ తీర్పు వెలువరిస్తుంది” అని అన్నారు. విభజన చట్టం ప్రకారం కామన్ప్రాజెక్టులను టేకోవర్చేసుకునే హక్కు కేఆర్ఎంబీకి ఉన్నా కేంద్రం ఆ ప్రయత్నం చేయలేదని వెదిరె శ్రీరామ్ తెలిపారు. ఏపీ అక్రమంగా రాయలసీమ లిఫ్ట్స్కీం చేపట్టిన తర్వాత రెండో అపెక్స్కౌన్సిల్సమావేశం నిర్వహించి, రెండు రాష్ట్రాల సీఎంల సమ్మతితోనే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ జ్యూరిస్డిక్షన్ఖరారు చేస్తూ గెజిట్నోటిఫికేషన్ఇచ్చామని అన్నారు.
శ్రీశైలం, సాగర్కూ ముప్పు!
ఆపరేషన్, మెయింటనెన్స్ సరిగ్గా లేక శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నాయని వెదిరె శ్రీరామ్ తెలిపారు. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని అన్నారు. ‘‘ప్రజలను భయపెట్టడానికి ఈ విషయం చెప్పడం లేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్ప్రాజెక్టులను ఎన్డీఎస్ఏ బృందాలు పరిశీలించి రిపోర్టులు ఇచ్చాయి. వాటి ఆధారంగా ఆయా ప్రాజెక్టులకు రిపేర్లు చేయాల్సిందే. నీళ్లు మాత్రం కావాలి.. ప్రాజెక్టుల నిర్వహణ, రిపేర్లు తమకు అవసరం లేదన్నట్టుగా రెండు రాష్ట్రాల(ఏపీ, తెలంగాణ) తీరు ఉంది” అని మండిపడ్డారు. రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టులను అడ్డుకునే అధికారం కేంద్ర సంస్థలకు లేదని అన్నారు.
విభజన చట్టం ప్రకారమే..!
కేఆర్ఎంబీనే తెలంగాణకు నీటి వాటాల్లో కోత పెట్టినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కేంద్రాన్ని, కేఆర్ఎంబీని విలన్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వెదిరె శ్రీరామ్ మండిపడ్డారు. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ డ్రాఫ్ట్ చేసిందే యూపీఏ ప్రభుత్వమని అన్నారు. ఆ యాక్ట్లోనే అపెక్స్కౌన్సిల్, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఉండాలని స్పష్టతనిచ్చారని తెలిపారు. ‘‘తెలంగాణ, ఏపీకి ఉమ్మడిగా శ్రీశైలం, నాగార్జున సాగర్ప్రాజెక్టులు ఉన్నాయి.
వాటి నిర్వహణను కేంద్రానికి ఇవ్వాలని విభజన చట్టంలోనే ఉంది. అప్పుడు చట్టం రూపొందించిన కాంగ్రెస్పార్టీ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని చెప్తున్నది” అని వెదిరె శ్రీరామ్ అన్నారు. 1,500 ఏపీ పోలీసులు సాగర్పైకి చొచ్చుకువచ్చారు కాబట్టే అక్కడ సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించామని తెలిపారు. సాగర్డ్యాం కుడివైపు గేట్లను తెలంగాణకు స్వాధీనం చేయాల్సిందేనని ఏపీని ఆదేశించినట్లు వెల్లడించారు. రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితి వచ్చిందని, శాంతి భద్రతల సమస్య తలెత్తింది కాబట్టే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు.
కేటీఆర్..! నేను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిని
భువనగిరి ఎంపీ సీటు కోసమే తాను ప్రాజెక్టుల అంశంపై మాట్లాడుతున్నట్లుగా కేటీఆర్కామెంట్స్ చేయడాన్ని వెదిరె శ్రీరామ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘నేను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగానే ఇక్కడ మాట్లాడుతున్న. పదేండ్లుగా కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న. బీజేపీలో క్రియాశీలంగా లేను. నేను పొలిటికల్కామెంట్స్చేయాలని అనుకుంటే బీజేపీ ఆఫీస్లోనే ప్రెస్మీట్పెట్టేవాడ్ని. భువనగిరి ఎంపీ టికెట్అనేది నా పర్సనల్అంశం. నాకు టికెట్ఇవ్వాలా లేదా అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్, బీఆర్ఎస్తప్పుడు ప్రచారం చేస్తున్నాయి కాబట్టే నేను ప్రెస్మీట్పెట్టి అన్ని ఆధారాలతో నిజాలు వెల్లడిస్తున్న” అని ఆయన స్పష్టం చేశారు.
అడిషనల్ టీఎంసీ పనులకు ఆమోదం లేదు
తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు సైట్ను మార్చిన తర్వాత అదనంగా 30 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే పెరిగిందని, ప్రాణహిత కన్నా కాళేశ్వరం ఆయకట్టు 1.80 లక్షల ఎకరాలు మాత్రమే ఎక్కువని వెదిరె శ్రీరామ్ తెలిపారు. కానీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. 96 రోజుల్లో రోజుకు 2 టీఎంసీలు ఎత్తిపోసేందుకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇచ్చిందని, అయినా రూ.30 వేల కోట్లతో అడిషనల్టీఎంసీ పనులు చేపట్టారని, ఆ పనులకు కేంద్రం ఆమోదం తెలుపలేదని అన్నారు.
కొత్తగా ఆయకట్టు, స్టోరేజీ కూడా పెరగడం లేదని అందుకే అడిషనల్టీఎంసీకి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అలాగే ఆర్థిక సంస్థల నుంచి రూ.28 వేల కోట్లు లోన్లు ఇవ్వకుండా కట్టడి చేశామని అన్నారు. అడిషనల్టీఎంసీ చేపట్టిన తర్వాత ప్రాజెక్టు కాస్ట్బెనిఫెట్రేషియో పెంచి చూపించడానికి సాగు విస్తీర్ణం ఒక్కో టీఎంసీకి ఎనిమిది నుంచి పది శాతం పెంచి చూపించారని పేర్కొన్నారు. సీతారామ ఎత్తిపోతల్లోనూ ఇలాగే సాగు విస్తీర్ణం పెంచి చూపించారని అన్నారు.
నీళ్ల అవసరం ఉన్నా 299 టీఎంసీలకే ఒప్పుకున్నరు
ఉమ్మడి ఏపీకి కృష్ణా నదిలో 811 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉండగా అందులో తెలంగాణకు 299 టీఎంసీలు తీసుకునేందుకు 2015లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంతమాత్రం లేదని వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. 2019 వరకు అంతే నీటిని తీసుకునేందుకు బోర్డు మీటింగుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ వచ్చిందన్నారు. 2020 నుంచి మాత్రం కృష్ణాలో 50 శాతం వాటా ఇవ్వాలని అడుగుతున్నదని తెలిపారు. ‘‘2015లో 299 టీఎంసీలు తీసుకునేందుకు అంగీకారం తెలిపే నాటికే పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, డిండి లిఫ్ట్, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఇంకో 200 టీఎంసీల నీటి అవసరం ఉంది. అయినా 299 టీఎంసీలు తీసుకు నేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంగీకారం తెలిపింది” అని అన్నారు.