ఇదేనా ‘వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ మూమెంట్’ అంటే!

ఇదేనా ‘వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ మూమెంట్’ అంటే!

మహీంద్రా గ్రూప్‌‌‌‌‌‌‌‌ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, రిలయన్స్‌‌‌‌‌‌‌‌  ముకేశ్‌‌‌‌‌‌‌‌ అంబానీ, టెక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెనూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వృందా కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆస్ట్రోనాట్‌‌‌‌‌‌‌‌ సునితా విలియమ్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి సరదాగా గడిపారు. ప్రధాని మోడీతో పాటు వైట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌ డిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాజరైన ఆయన తాజాగా పై సెల్ఫీని షేర్ చేశారు. ‘యూఎస్ కామర్స్‌‌‌‌‌‌‌‌ సెక్రెటరీతో మాట్లాడుతూ నేను, ముకేశ్ అంబానీ,  వృందా షటిల్ బస్‌‌‌‌‌‌‌‌ను మిస్ అయ్యాం.  

ఉబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేద్దామనుకునే టైమ్‌‌‌‌‌‌‌‌లో నాసా ఆస్ట్రోనాట్‌‌‌‌‌‌‌‌ సునితా విలియమ్స్‌‌‌‌‌‌‌‌ను కలిశాం. ఉబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులు తన స్పెస్ షటిల్‌‌‌‌‌‌‌‌లో డ్రాప్ చేయమని అడిగాం కూడా’ అంటూ ట్వీట్ చేశారు.