హైదరాబాద్, వెలుగు: సోషల్ఎంటర్ప్రిన్యూర్షిప్, సస్టయినబిలిటీ, కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీపై చర్చించడానికి అండ్ పర్పస్ ఫోరమ్ హైదరాబాద్లోని టీ–-హబ్లో సదస్సు నిర్వహించింది. ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యారంగానికి చెందిన 200మందికిపైగా ప్రముఖులు పాల్గొన్నారు. భారతదేశ సర్కులర్ ఎకానమీ పర్యావరణ బాధ్యత మాత్రమే కాదని, 2030 నాటికి 300 నుంచి 400 బిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక అవకాశాలను అందిస్తుందని ఆర్ఈ సస్టైనబిలిటీ సీఈఓ మసూద్ మల్లిక్ తెలిపారు. అన్ని రంగాలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఈ స్థాయి వృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
